విరిగిన రైలు పట్టాలు.. రైతు అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
- ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లా లాల్గోపాల్ గంజ్ ప్రాంతంలో విరిగిన పట్టాలు
- ఉదయం పొలానికి వెళుతూ పట్టాలకున్న పగుళ్లను గుర్తించిన రైతు
- వెంటనే ఎర్రటి వస్త్రాన్ని గాల్లో ఊపుతూ గోమతి ఎక్స్ప్రెస్ను ఆపిన వైనం
- పెను ప్రమాదాన్ని తప్పించిన రైతుకు లోకోపైలట్ కృతజ్ఞతలు
ఆ తరువాత విరిగిన పట్టాలను చూసి షాకయిపోయిన లోకోపైలట్ రైతును అభినందించాడు. పెను ప్రమాదం జరగకుండా నివారించావంటూ అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, ట్రాక్ పాడైన కారణంగా ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టాలకు మరమ్మతులు పూర్తయ్యాక అధికారులు ఆ మార్గంలో రైలు సర్వీసులను పునరుద్ధరించారు.