బలిజకాపులు, ఎస్సీలతో భేటీ కానున్న లోకేశ్.. ఈనాటి పాదయాత్ర షెడ్యూల్ ఇదిగో!
- 15వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
- ఉదయం గొల్ల కండ్రిగ గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించిన లోకేశ్
- ఇప్పటి వరకు 170 కిలోమీటర్ల మేర కొనసాగిన యాత్ర
ఈనాటి (10-02-2023) లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్:
- ఉదయం 8 గంటలకు రేణుకాపురం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
- 8.35 గంటలకు గొల్ల కండ్రిగ గ్రామస్తులతో రచ్చబండ సమావేశం.
- 10.30 గంటలకు ఎగువ కమ్మ కండ్రిగలో రైతులతో మాటమంతీ.
- మధ్యాహ్నం 12.05 గంటలకు దిగువ కమ్మ కండ్రిగలో బెల్లం తయారీదారులతో మాటామంతీ.
- 1.10 గంటలకు కాపు కండ్రిగలో బలిజకాపులతో సమావేశం.
- 1.25 గంటలకు కాపు కండ్రిగలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
- 2.10 గంటలకు కాపు కండ్రిగలో భోజన విరామం.
- 3.10 గంటలకు కాపు కండ్రిగ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
- సాయంత్రం 5.40 గంటలకు ఎస్ఆర్ పురం గ్రామస్తులతో మాటామంతీ.
- 6.10 గంటలకు ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ వద్ద ప్రముఖులతో సమావేశం.
- 7.00 గంటలకు ఎస్ఆర్ పురం హనుమాన్ టెంపుల్ ఎదుట విడిది కేంద్రంలో బస.