జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టే.. చంద్రబాబుకు ధన్యవాదాలు: రఘురామకృష్ణరాజు
- రాజధాని అమరావతేనని కేంద్రం చెప్పిందన్న రఘురాజు
- కావాలనుకుంటే జగన్ విశాఖకు వెళ్లొచ్చని వ్యాఖ్య
- సునీల్ కుమార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారని వెల్లడి
సీఐడీ పోలీసులు జగన్ డైరెక్షన్ లో తనను దారుణంగా హింసించిన అంశంలో రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందని రఘురాజు అన్నారు. తనను హింసించిన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. తన ప్రాణాలకు ప్రతిపక్ష నేతలు అండగా ఉన్నారని... ముఖ్యంగా తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారని, అక్కడ గోల్ఫ్ ఆడుకుంటున్నారని చెప్పారు.