Tamilnadu: దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జీ...వివరాలు ఇవిగో

iidian ralways constructing first vertical lift ralway sea bridge at rameswaram in tamilnadu
  • తమిళనాడులో నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి
  • రామేశ్వరం సమీపంలో న్యూ పంబన్ బ్రిడ్జి పేరిట నిర్మాణం
  • 63 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ
  • ఓడలు, పడవలు వచ్చే సమయంలో ఈ బ్రిడ్జి పైకి లేసేలా నిర్మాణం

దేశంలో నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో అత్యంత ఎత్తైన బ్రిడ్జిని నిర్మించిన భారత ప్రభుత్వం... తాజాగా సముద్రంపై అవసరమైనప్పుడు పైకి లేచే విధంగా ఓ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తోంది. దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా పిలుస్తోంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణం జరుగుతున్న ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి వివరాలను వెల్లడిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రకటనతో పాటు నిర్మాణంలో ఉన్న సదరు బ్రిడ్జి ఫొటోలను కూడా విడుదల చేసింది.

దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం జరుపుకుంటోంది. తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మితమవుతున్న ఈ బ్రిడ్జికి న్యూ పంబన్ బ్రిడ్జిగా రైల్వే శాఖ నామకరణం చేసింది. దాదాపుగా 63 మీటర్ల పొడవుతో సముద్రంపై నిర్మిస్తోంది,. ఈ బ్రిడ్జి మార్గంలో నీటిపై పడవలు, ఓడలు వెళ్లే సమయంలో ఎలాంటి అవాంతరం లేకుండా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఆ తర్వాత యధాతథంగా తిరిగి సాధారణ రూపంలోకి వచ్చి చేరుతుంది.

  • Loading...

More Telugu News