గంగమ్మ ఒడి చేరిన పంచముఖ వినాయకుడు... ఫొటోలు ఇవిగో
- 50 అడుగుల ఎత్తుతో ఏర్పాటైన ఖైరతాబాద్ వినాయకుడు
- పంచముఖాలతో దర్శనమిచ్చిన గణనాథుడు
- ఉదయం నుంచి రాత్రి దాకా కొనసాగిన శోభా యాత్ర
ఈ ఏడాది పంచముఖ వినాయకుడిగా దాదాపుగా 50 అడుగుల ఎత్తుతో పూర్తిగా మట్టితోనే ఖైరతాబాద్ వినాయకుడు ఏర్పాటైన సంగతి తెలిసిందే. వినాయక చవితి నుంచి శుక్రవారం దాకా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. చివరి రోజైన శుక్రవారం వినాయకుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరిలో చాలా మంది పంచముఖ వినాయకుడి శోభాయాత్రలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.