ఏ ఎన్నికలు వచ్చినా మాదే విజయం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై మంత్రులు ఇంద్రకరణ్, జగదీశ్ రెడ్డి
- పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు
- కేసీఆర్ వెంటే ప్రజలు
- టీఆర్ఎస్కు తిరుగులేదు
మరోవైపు, ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కోటిరెడ్డి విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం కేసీఆర్ వెంటే నడుస్తోందని ఈ ఎన్నికల ద్వారా మరోసారి స్పష్టమైందని చెప్పారు.
తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు సహకరించిన టీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టామని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లాలో తమ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ గెలుపుతో ఆ పార్టీ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.