మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్యపై హైదరాబాదులో కేసు నమోదు
- స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు
- దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పీఎస్ పోలీసులు
- గత కొంత కాలంగా కొనసాగుతున్న వివాదం
ఆ సైట్ లోకి ప్రవేశించి నానా హంగామా చేశారంటూ నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసింది. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ, స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొంది. ఆ స్థలం తమదేనని, తాము కొనుగోలు చేశామని ఆమె చెపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.