ధనుష్ 'ఓం' నుంచి మాస్ జాతర.. ఫస్ట్ సింగిల్ 'అలాకా లూవా' వచ్చేసింది!
- ధనుష్ 55వ చిత్రం 'ఓం' నుంచి తొలి సింగిల్ విడుదల
- 'అలకా లూవా' పేరుతో తెలుగులో తొలి పాట
- సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లు
- సాయి అభ్యంకర్ సంగీతం, ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం
- రామ్ మిరియాల గానం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ
జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు ధనుష్ నటిస్తున్న 55వ చిత్రం 'ఓం'. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా తొలి పాట విడుదలైంది. 'అలాకా లూవా' పేరుతో వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మాస్ బీట్స్, ఎనర్జిటిక్ వోకల్స్తో పూర్తిస్థాయి సెలబ్రేషన్ ఆంథమ్గా ఈ పాటను తీర్చిదిద్దారు.
సంగీత సంచలనం సాయి అభ్యంకర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా, స్వయంగా ఆలపించారు. తెలుగు వెర్షన్కు ప్రముఖ గాయకులు రామ్ మిరియాల, అరుణ్ కౌండిన్య గొంతు కలపగా, స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటలో ధనుష్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' టైటిల్ టీజర్ కూడా విశేషమైన స్పందన రాబట్టుకుంది. 'ఓం – చాప్టర్ 1: ఉధిరమ్- ది బ్లడ్ వుడ్' అనే పూర్తి టైటిల్తో వచ్చిన ఈ టీజర్, సినిమా ఎంతటి తీవ్రమైన యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతోందో స్పష్టం చేసింది. ఇందులో ధనుష్ మాస్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో తారాగణం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. 'మారి 2' తర్వాత ధనుష్, సాయి పల్లవి మరోసారి ఈ సినిమాతో జతకడుతుండగా, యువతలో క్రేజ్ ఉన్న శ్రీలీల కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
'అమరన్' వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్స్, ఆర్-టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. భారీ తారాగణం, అద్భుతమైన సాంకేతిక బృందంతో వస్తున్న 'ఓం' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంగీత సంచలనం సాయి అభ్యంకర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా, స్వయంగా ఆలపించారు. తెలుగు వెర్షన్కు ప్రముఖ గాయకులు రామ్ మిరియాల, అరుణ్ కౌండిన్య గొంతు కలపగా, స్టార్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటలో ధనుష్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' టైటిల్ టీజర్ కూడా విశేషమైన స్పందన రాబట్టుకుంది. 'ఓం – చాప్టర్ 1: ఉధిరమ్- ది బ్లడ్ వుడ్' అనే పూర్తి టైటిల్తో వచ్చిన ఈ టీజర్, సినిమా ఎంతటి తీవ్రమైన యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతోందో స్పష్టం చేసింది. ఇందులో ధనుష్ మాస్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో తారాగణం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. 'మారి 2' తర్వాత ధనుష్, సాయి పల్లవి మరోసారి ఈ సినిమాతో జతకడుతుండగా, యువతలో క్రేజ్ ఉన్న శ్రీలీల కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
'అమరన్' వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్స్, ఆర్-టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 16న విజయదశమి కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. భారీ తారాగణం, అద్భుతమైన సాంకేతిక బృందంతో వస్తున్న 'ఓం' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.