అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను పొడిగించిన కేంద్రం
- మార్చి 31 వరకు ఆంక్షలను పొడిగించిన కేంద్రం
- కరోనా నేపథ్యంలో గత మార్చిలో ఆంక్షల విధింపు
- కార్గో, ప్రత్యేక విమానాలకు ఆంక్షల నుంచి మినహాయింపు
కరోనా వైరస్ నేపథ్యంలో గత మార్చిలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని విధించారు. తదనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించే కార్యాచరణలో భాగంగా అనేక ఆంక్షలను కేంద్రం సడలిస్తూ వచ్చింది. అయితే, అంతర్జాతీయ విమానాల రాకపోకలపై మాత్రం ఆంక్షలను కొనసాగిస్తూనే ఉంది. డొమెస్టిక్ విమాన సర్వీసులు గత ఏడాది చివర్లో పునఃప్రారంభమయ్యాయి. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.