కంగన రనౌత్పై పరువునష్టం కేసు.. కోర్టుకు హాజరైన జావేద్ అఖ్తర్
- ఓ ఇంటర్వ్యూలో జావెద్ అఖ్తర్ గురించి మాట్లాడిన కంగన
- తన పరువుకు భంగం కలిగించారంటూ కేసు వేసిన అఖ్తర్
- తదుపరి విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా
కేసు వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంశంపై కంగన మాట్లాడుతూ జావెద్ అఖ్తర్ పేరును ప్రస్తావించింది. ఆ ఇంటర్వ్యూకు ఆన్ లైన్లో లక్షలాది వ్యూస్ వచ్చాయి. దీంతో, తన పరువుకు భంగం కలిగించేలా కంగన వ్యాఖ్యానించిందని అఖ్తర్ కోర్టును ఆశ్రయించారు.