మాలిలో భారత వ్యాపారి కిడ్నాప్ సుఖాంతం.. రూ.44 కోట్లతో విడుదల!
- మాలిలో కిడ్నాప్కు గురైన భారత సంతతి వ్యాపారి విడుదల
- రూ.44 కోట్ల విమోచన క్రయధనం చెల్లించిన కుటుంబం
- సూరత్ వజ్రాల పరిశ్రమతో వ్యాపారికి సంబంధాలు
పశ్చిమాఫ్రికా దేశం మాలిలో సుమారు మూడు నెలల క్రితం కిడ్నాప్కు గురైన భారత సంతతి వజ్రాల వ్యాపారి ధీరూ రమణి (75) ఎట్టకేలకు విడుదలయ్యారు. ఆయన విడుదల కోసం కుటుంబసభ్యులు ఏకంగా 4 మిలియన్ యూరోలు (సుమారు రూ.44 కోట్లు) విమోచన క్రయధనంగా చెల్లించారు. ఈ వారం ప్రారంభంలో విడుదలైన రమణి, ప్రస్తుతం మాలిలోనే స్థానిక అధికారుల అదుపులో ఉన్నారు.
గుజరాత్లోని అమ్రేలీ జిల్లాకు చెందిన ధీరూ రమణికి సూరత్ వజ్రాల పరిశ్రమతో పాత సంబంధాలున్నాయి. కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన ఆయన, వ్యాపార విస్తరణలో భాగంగా మాలిలోని ఒక బంగారు గనిలో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్లో అక్కడే కిడ్నాప్కు గురయ్యారు.
ఆయన్ను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు మొదట రూ.100 కోట్లు డిమాండ్ చేయగా, అమెరికాలో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులు నేరుగా చర్చలు జరిపి రూ.44 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత ప్రభుత్వ ఏజెన్సీల ప్రమేయం ఏమీ లేదని తెలుస్తోంది. ఆయన విడుదలకు దారితీసిన పరిస్థితులపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.
మాలిలో భద్రతా పరిస్థితులు సరిగా లేకపోవడంతో, రమణి కిడ్నాప్ జరిగిన ఏప్రిల్ నెలలోనే అక్కడి భారత రాయబార కార్యాలయం పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? విమోచన క్రయధనం చెల్లింపు వంటి వివరాలపై మాలి ప్రభుత్వం గానీ, భారత ప్రభుత్వం గానీ అధికారికంగా స్పందించలేదు. రమణి స్వదేశానికి ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
గుజరాత్లోని అమ్రేలీ జిల్లాకు చెందిన ధీరూ రమణికి సూరత్ వజ్రాల పరిశ్రమతో పాత సంబంధాలున్నాయి. కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడిన ఆయన, వ్యాపార విస్తరణలో భాగంగా మాలిలోని ఒక బంగారు గనిలో పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్లో అక్కడే కిడ్నాప్కు గురయ్యారు.
ఆయన్ను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు మొదట రూ.100 కోట్లు డిమాండ్ చేయగా, అమెరికాలో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులు నేరుగా చర్చలు జరిపి రూ.44 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో భారత ప్రభుత్వ ఏజెన్సీల ప్రమేయం ఏమీ లేదని తెలుస్తోంది. ఆయన విడుదలకు దారితీసిన పరిస్థితులపై స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.
మాలిలో భద్రతా పరిస్థితులు సరిగా లేకపోవడంతో, రమణి కిడ్నాప్ జరిగిన ఏప్రిల్ నెలలోనే అక్కడి భారత రాయబార కార్యాలయం పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? విమోచన క్రయధనం చెల్లింపు వంటి వివరాలపై మాలి ప్రభుత్వం గానీ, భారత ప్రభుత్వం గానీ అధికారికంగా స్పందించలేదు. రమణి స్వదేశానికి ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.