రాజకీయాల్లోకి ధనుష్?.. అభిమానులకు కీలక పిలుపు!
- అభిమానులు జనసేవ చేయాలన్న నటుడు ధనుష్
- ఆయన వ్యాఖ్యలతో పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు
- విజయ్ తర్వాత ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారని చర్చ
- జాతీయ అవార్డులపై వచ్చిన విమర్శలపైనా స్పందన
- 'రాయన్' కన్నా మంచి చిత్రాలున్నాయని అంగీకారం
ప్రముఖ నటుడు ధనుష్ తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి ఊహాగానాలకు తెరలేపారు. అభిమానులు తమ ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రజా సేవ కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో, ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ మొదలైంది.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ “ఇంతమంది ఒకేచోట చేరారు. ఈ ఐక్యతలో గొప్ప శక్తి ఉంది. దానికి ఓ ప్రయోజనం చేకూర్చాలి. కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్కే పరిమితం కాకుండా మనం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. మీ ప్రాంతంలోని ప్రజలకు, మీ ఇంటి చుట్టుపక్కల నివసించే కుటుంబాలకు మీకు తోచిన సాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడాలి. మీరు అది చేస్తారని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ‘దళపతి’ విజయ్ తర్వాత ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. “తమిళనాడుకు ధనుష్ లాంటి విద్యావంతులు, ధైర్యవంతులైన నాయకులు అవసరం” అని ఒకరంటే, “త్వరలోనే ధనుష్ కొత్త పార్టీ ప్రకటన ఆశించవచ్చు” అని మరొకరు అభిప్రాయపడ్డారు.
జాతీయ అవార్డుల విమర్శలపై స్పందన
ఇదే కార్యక్రమంలో, జాతీయ అవార్డులపై వచ్చిన విమర్శలపైనా ధనుష్ స్పందించారు. 2024లో తన దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ కంటే మెరుగైన తమిళ చిత్రాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, ఒకే ఏడాదిలో ఒక తమిళ నటుడికి రెండు జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయమని, దాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి గాను ధనుష్కు స్పెషల్ మెన్షన్ అవార్డు లభించగా, ‘రాయన్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ “ఇంతమంది ఒకేచోట చేరారు. ఈ ఐక్యతలో గొప్ప శక్తి ఉంది. దానికి ఓ ప్రయోజనం చేకూర్చాలి. కేవలం ఆడియో వేడుకలు, ఫ్యాన్స్ మీట్స్కే పరిమితం కాకుండా మనం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. మీ ప్రాంతంలోని ప్రజలకు, మీ ఇంటి చుట్టుపక్కల నివసించే కుటుంబాలకు మీకు తోచిన సాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను మరింత గర్వపడాలి. మీరు అది చేస్తారని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ‘దళపతి’ విజయ్ తర్వాత ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. “తమిళనాడుకు ధనుష్ లాంటి విద్యావంతులు, ధైర్యవంతులైన నాయకులు అవసరం” అని ఒకరంటే, “త్వరలోనే ధనుష్ కొత్త పార్టీ ప్రకటన ఆశించవచ్చు” అని మరొకరు అభిప్రాయపడ్డారు.
జాతీయ అవార్డుల విమర్శలపై స్పందన
ఇదే కార్యక్రమంలో, జాతీయ అవార్డులపై వచ్చిన విమర్శలపైనా ధనుష్ స్పందించారు. 2024లో తన దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ కంటే మెరుగైన తమిళ చిత్రాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, ఒకే ఏడాదిలో ఒక తమిళ నటుడికి రెండు జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయమని, దాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి గాను ధనుష్కు స్పెషల్ మెన్షన్ అవార్డు లభించగా, ‘రాయన్’ ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే.