Kandula Sivananda Reddy: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత!

  • తెల్లవారుజామున గుండెపోటుతో మృతి
  • టీడీపీ నుంచి బీజేపీలో చేరిన కందుల
  • పలు విద్యా సంస్థలను నిర్వహించిన శివానందరెడ్డి
YSR opponent Kandula Sivananda Reddy dead

మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కందుల 1989లో కాంగ్రెస్ తరపున కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

వ్యాపారవేత్తగా ఏపీలో కందుల శివానందరెడ్డికి గుర్తింపు ఉంది. కందుల గ్రూప్స్ పేరుతో ఆయనకు పలు విద్యా సంస్థలు ఉన్నాయి. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ప్రత్యర్థిగా కందులకు గుర్తింపు ఉంది. కాలక్రమంలో రాజకీయంగా ఆయన సైలెంట్ అయిపోయారు.

  • Loading...

More Telugu News