డ్రగ్స్ కేసులో రియా ఎవరి పేర్లూ చెప్పలేదు!: ఎన్సీబీ వివరణ
- రియా నోటి నుంచి ఎవరి పేర్లూ రాలేదు
- మా వద్ద ఉన్నది డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి పేర్లే
- ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా
ఈ వార్తలు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ కలకలం రేపాయి. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ దందాలో ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఓ ప్రకటన విడుదల చేశారు. రియా నోటి నుంచి ఎవరి పేర్లూ రాలేదని స్పష్టం చేశారు. తాము కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి జాబితానే తయారు చేశామని, దాన్నే సినీ పరిశ్రమ జాబితాగా పొరపడ్డారేమోనని అన్నారు. సినీ పరిశ్రమపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రమూ నిజం లేదని ఈ ప్రకటనలో కేపీఎస్ మల్హోత్రా పేర్కొనడం గమనార్హం.