ఏపీలో కరోనా మరణాలు తగ్గుతున్నాయి: కేంద్రం
- వారానికి 4.5 శాతం తగ్గుదల కనిపిస్తోందన్న కేంద్రం
- మహారాష్ట్ర, తమిళనాడులోనూ తగ్గుదల
- ఢిల్లీ, కర్ణాటకల్లో పెరుగుతున్న మరణాలు
మరోపక్క, కర్ణాటక, ఢిల్లీలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఢిల్లీలో వారానికి 50 శాతం, కర్ణాటకలో రోజుకు 9.6 శాతం పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త గణాంకాలతో పోల్చితే భారత్ లో ప్రతి 10 లక్షల మందిలో 2,792 పాజిటివ్ కేసులు, 49 మరణాలు సంభవిస్తున్నాయని రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు.