ఆ కథనాలు అబద్ధం.. నేను బీజేపీలో చేరలేదు!: నటి వరలక్ష్మి

  • ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ
  • ఇందులో భాగంగా వరలక్ష్మిని కలిసిన బీజేపీ నేత మురళీధర్ రావు
  • వరలక్ష్మి బీజేపీలో చేరిందంటూ తమిళ మీడియా కథనాలు
తమిళ నటి వరలక్ష్మి బీజేపీలో చేరిందంటూ అక్కడి మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ కథనాలపై వరలక్ష్మి స్పందించింది. తాను బీజేపీలో చేరలేదని, ఆ వార్తలన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేత మురళీధర్ రావు ఈరోజు వరలక్ష్మిని కలిశారు.

ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆమెకు వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీలో వరలక్ష్మి చేరిపోయిందని, పార్టీ కండువా కప్పుకుందంటూ తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న వరలక్ష్మి అసలు విషయం చెప్పింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మి ప్రస్తుతం దళపతి 62, మిస్టర్ చంద్రమౌళి, శక్తి, కదల్ మన్నన్ సినిమాల్లో నటిస్తోంది.
Go Back to Shorts
tamil artist varalakshmi
bjp

More Telugu News