మమతకు భారీ షాక్: బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు!

20 MPs In Touch With BJP Sources
  • టీఎంసీలో తీవ్రరూపం దాల్చిన సంక్షోభం
  • ప్రతిపక్ష నేతగా రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి గుర్తింపు
  • బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నట్లు ఊహాగానాలు
  • మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అసంతృప్తితోనే తిరుగుబాటు
  • బెంగాల్‌లో పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసిన టీఎంసీ
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి, ఇప్పుడు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తీవ్రస్థాయికి చేరింది. ఈ సంక్షోభం రాష్ట్రానికే పరిమితం కాకుండా, ఢిల్లీకి కూడా పాకింది. ఏకంగా 20 మంది లోక్‌సభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు మమతా బెనర్జీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

జూన్ 3న, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ గుర్తించారు. తమకు 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రెబల్ వర్గం ప్రకటించింది. దీంతో అసెంబ్లీలో మమతా బెనర్జీ వర్గం బలహీనపడింది. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో అధికశాతం మంది రెబల్ వర్గం వైపు ఉన్నారు.

ఏప్రిల్-మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరపడిన తర్వాత ఈ సంక్షోభం మొదలైంది. ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలి, ఎన్నికల ఓటమి తర్వాత ఆయన పెత్తనం చెలాయించడమే ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తామంతా మమతా బెనర్జీ నాయకత్వాన్ని గౌరవిస్తామని, కానీ అభిషేక్ పెత్తనాన్ని సహించబోమని రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే, పార్లమెంటులో మమతా బెనర్జీ బలం మరింత క్షీణిస్తుంది. ఇటీవల మమత నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కేవలం ఆరుగురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకావడం ఆమె చుట్టూ విధేయుల సంఖ్య తగ్గుతోందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ తిరుగుబాటు నేపథ్యంలో టీఎంసీ బెంగాల్‌లోని అన్ని కమిటీలను రద్దు చేసి, ఆత్మపరిశీలన చేసుకుంటామని ప్రకటించింది.
Advertisement
20 MPs In Touch With BJP
Churn Brewing In Trinamool

More Telugu News