టీ20 ప్రపంచ కప్కు సిరాజ్ ఎంపిక కాకపోవడంపై స్పందించిన ఏబీ డివిల్లియర్స్
- సిరాజ్కు జట్టులో చోటు దక్కకపోవడం దురదృష్టకరమన్న డివిల్లియర్స్
- సెలక్టర్లు ఫామ్ కంటే కూర్పుకు ప్రాధాన్యత ఇచ్చారన్న డివిల్లియర్స్
- హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడని అందుకే జట్టులోకి తీసుకుని ఉంటారని వెల్లడి
సిరాజ్ వన్డే జట్టులో స్థానం సంపాదించుకున్నాడని, కానీ దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్కు ఎంపిక కాలేకపోయాడని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఎంపికయ్యారని, హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయగలడని తెలిపాడు. అందుకే సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకున్నట్టు అర్థమవుతోందని చెప్పాడు. సీమ్ బౌలర్లతో పాటు స్పిన్నర్లపై కూడా సెలక్టర్లు దృష్టి సారించినట్లు చెప్పాడు. ఒకవేళ వారు సీమర్లతో పాటు వికెట్లు సాధిస్తే అది అదనపు ప్రయోజనమని అభిప్రాయపడ్డాడు.
కాగా, సిరాజ్ 2024 జులైలో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే, సిరాజ్ జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్లో పాల్గొననున్నాడు.
ఏబీ డివిల్లియర్స్, సిరాజ్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించారు.