నకిలీ మద్యం కేసు: జోగి రమేశ్ సోదరుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
- నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, జోగి రాములకు 4 రోజుల కస్టడీ
- విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ
- నవంబర్ 26 నుంచి 29 వరకు కొనసాగనున్న విచారణ
- నెల్లూరు జైలు నుంచి విచారణకు తరలించనున్న అధికారులు
- కేసు నెట్వర్క్పై లోతుగా ఆరా తీయడమే లక్ష్యం
ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న జోగి సోదరులను అధికారులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోనున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, నవంబర్ 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కస్టడీ కొనసాగుతుంది. ఈ సమయంలో నకిలీ మద్యం తయారీ, పంపిణీ నెట్వర్క్, ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ఇతరుల వివరాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
ఇటీవల జోగి సోదరులకు సంబంధించిన నివాసాల్లో అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేశారు.