Radhakrishnan: పుట్టపర్తిలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

Vice President Radhakrishnan welcomed by CM Chandrababu in Puttaparthi
  • పుట్టపర్తికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
  • ఆయనకు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
  • భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
  • సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కూడా హాజరు
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ పర్యటనలో భాగంగా. ముందుగా ప్రశాంతి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
Radhakrishnan
Vice President Radhakrishnan
Chandrababu Naidu
Nara Lokesh
Puttaparthi
Sri Satya Sai Baba
Satya Sai Centenary Celebrations
Prasanthi Nilayam
Sri Satya Sai University

More Telugu News