మైనర్ బాలికపై అత్యాచారం.. 32 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సంచలన తీర్పు
- తీర్పు వెలువరించిన నల్గొండ జిల్లా పోక్సో న్యాయస్థానం
- మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడు
- జైలు శిక్షతో పాటు రూ. 75 వేల జరిమానా విధింపు
2022లో నల్గొండ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి స్థానిక పోక్సో కోర్టులో వాదనలు జరిగాయి. నేడు కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెలువరించారు. 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 75 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని తీర్పులో పేర్కొన్నారు.