ఓటీటీకి మోహన్ లాల్ మూవీ!
- మోహన్ లాల్ హీరోగా మలయాళ సినిమా
- కామెడీడ్రామా జోనర్లో నడిచే కథ
- ఆరేళ్ల తరువాత ఓటీటీకి వచ్చిన సినిమా
- రేపాటు నుంచి ఈటీవీ విన్ లో
జిబి - జోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ కథానాయకుడిగా నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో రాధిక .. హనీ రాజ్ .. సిద్ధికీ కనిపించనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన 2019లో ఈ సినిమాను విడుదల చేశారు. 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 35 కోట్లకి పైగా వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'ఈటీవీ విన్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మోహన్ లాల్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. మలయాళంలో అప్పట్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు పడతాయనేది చూడాలి.