అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్
- ఈరోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుట్టిన జనసేనాని
- మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను సందర్శించనున్న పవన్
- కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల నిర్వహణ
- పవన్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి
ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్ సందర్శించనున్నారు. కాగా, మూడు రోజుల ఈ యాత్రలో కేరళ, తమిళనాడులోని ఏడు క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు. వాటిలో అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.