కర్ణాటక రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan resaponds on road accident in Karnataka
  • సింధనూరు వద్ద వాహనం బోల్తా
  • నలుగురి మృతి
  • మృతుల్లో ముగ్గురు వేద విద్యార్థులు
కర్ణాటకలో ఓ వాహనం బోల్తా పడగా... ఏపీకి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు, ఆ వాహన డ్రైవర్ మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. 

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు హంపిలో ఆరాధనోత్సవానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారని తెలిసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని... మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Road Accident
Karnataka
Andhra Pradesh

More Telugu News