కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
- హైదరాబాద్ నుంచి కొండపోచమ్మకు వచ్చిన ఏడుగురు హైదరాబాద్ యువకులు
- ఈత కోసం వెళ్లి ఐదుగురి మృతి
- మృతి చెందిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు
హైదరాబాద్ నగరానికి చెందిన ఏడుగురు యువకులు ఈరోజు కొండపోచమ్మ సాగర్కు వచ్చారు. వారు ఈత కోసం నీళ్లలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఐదుగురు నీట మునిగి చనిపోయారు. మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.