చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల మేలు కోసమే ఆలోచిస్తారు: నాదెండ్ల మనోహర్
- గత ప్రభుత్వం రైతులను విస్మరించిందన్న నాదెండ్ల
- రైతులకు సరిగా ధాన్యం డబ్బులు ఇవ్వలేదని విమర్శలు
- కూటమి ప్రభుత్వం రైతు కుటుంబాల్లో సంక్రాంతి తీసుకొచ్చిందని వెల్లడి
"జనవరి 5వ తేదీ నాటికి ఖరీఫ్ సీజన్లో 4,15,066 మంది రైతుల నుంచి 27,00,00 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశాము. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం నాటి ఖరీఫ్ లో 2,12,431 మంది నుంచే ధాన్యం తీసుకొంది. మా ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయడమే కాదు 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తోంది. రూ.6,083.69 కోట్లు చెల్లింపులు చేశాం" అని నాదెండ్ల వివరించారు.