భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా విలవిల
- చెన్నై వేదికగా బంగ్లాదేశ్, భారత్ తొలి టెస్టు
- చెలరేగిన భారత బౌలర్లు
- 92 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన బంగ్లా
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టగా... మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 35 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. క్రీజులో మెహదీ హసన్ మిరాజ్ (10 బ్యాటింగ్), హసన్ ముహమూద్ (9 బ్యాటింగ్) ఉన్నారు.
ఇంకా టీమిండియా కంటే బంగ్లా 266 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.