హార్ముజ్ను వెంటనే తెరవకుంటే... ఇరాన్కు ట్రంప్ ఘాటు హెచ్చరికలు
- ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్
- అమెరికాతో చర్చలు జరగడం లేదంటూ ఇరాన్ ఖండన
- ఒమన్తో మాత్రమే సంప్రదింపులు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ
- ట్రూత్ సోషల్లో ఇరాన్పై ట్రంప్ విమర్శలు
- హార్ముజ్ జలసంధి భవిష్యత్తుపై కొనసాగుతున్న అనిశ్చితి
హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ అంశంపై ఇరాన్తో చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా మారాయి.
ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధి అంశంలో త్వరలోనే నిర్ణయం వస్తుందని చెప్పారు. ‘‘జలసంధిని వెంటనే తెరవాలి. ఒకటి రెండు రోజుల్లోనే పరిణామాలు స్పష్టమవుతాయి. లేకపోతే ఇరాన్ తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు వైట్ హౌస్లో కూడా ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడారు. ఇరాన్కు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిని తెరవడంపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి తెలిపారు. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మినహా చర్చల బృందంలోని సభ్యులంతా ఇరాన్లోనే ఉన్నారని వెల్లడించారు.
దీనిపై ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. సమావేశం కావాలని కోరుతూ, మరోవైపు చర్చలు లేవని చెప్పడం ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
అయితే ఒమన్తో మాత్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత కోసం తాత్కాలిక ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ చర్చల్లో మరే ఇతర దేశం భాగస్వామి కాదని స్పష్టం చేసింది.
ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధి అంశంలో త్వరలోనే నిర్ణయం వస్తుందని చెప్పారు. ‘‘జలసంధిని వెంటనే తెరవాలి. ఒకటి రెండు రోజుల్లోనే పరిణామాలు స్పష్టమవుతాయి. లేకపోతే ఇరాన్ తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు వైట్ హౌస్లో కూడా ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడారు. ఇరాన్కు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిని తెరవడంపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి తెలిపారు. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మినహా చర్చల బృందంలోని సభ్యులంతా ఇరాన్లోనే ఉన్నారని వెల్లడించారు.
దీనిపై ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. సమావేశం కావాలని కోరుతూ, మరోవైపు చర్చలు లేవని చెప్పడం ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
అయితే ఒమన్తో మాత్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత కోసం తాత్కాలిక ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ చర్చల్లో మరే ఇతర దేశం భాగస్వామి కాదని స్పష్టం చేసింది.