హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు: హరీశ్ రావు
- అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చచ్చిపోయిందని ఆగ్రహం
- హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని మండిపాటు
- కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉందని వ్యాఖ్య
కొద్దికాలంలోనే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చారో లేదో అప్పుడే రూ.800 కోట్ల ఉపాధి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
ఈ తొమ్మిది నెలల్లో రెండు పెన్షన్లను ఎగ్గొట్టారన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని, దీంతో చాలామంది రోగాల బారిన పడుతున్నారన్నారు. మెట్రో రైలు, ఫార్మా సిటీ అంశంలోనూ మాట మార్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం రైతులకు మించి రుణమాఫీ జరగలేదన్నారు.