వాలంటీర్లకు న్యూస్ పేపర్ కొనుగోలు అలవెన్స్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
- సాక్షి పత్రిక కొనాలంటూ గతంలో వాలంటీర్లకు అలవెన్స్
- నెలకు రూ.200 అలవెన్స్ ఇచ్చేలా జీవో జారీ
- ఆ ఉత్తర్వులను రద్దు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం
ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పెద్ద సంఖ్యలో వాలంటీర్లు టీడీపీ నేతలను కలిసి మొరపెట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.