భాగ్యనగరాన్ని గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దాం: హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత
- తాము రజాకార్లమేనని అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో చెప్పారన్న మాధవీలత
- అలాంటి రజాకార్ల పాలన అంతం కావాలని చేసిన పోరాటంలో ఎంతోమంది తీవ్రంగా నష్టపోయారని వెల్లడి
- ప్రజల డబ్బు ప్రజలే అనుభవించాలని భావించి... ఆ దిశగా పని చేస్తోన్న నేత ప్రధాని మోదీ ఒక్కరేనని వ్యాఖ్య
ప్రజల డబ్బు ప్రజలే అనుభవించాలని భావించి... ఆ దిశగా పని చేస్తోన్న నేత ప్రధాని మోదీ ఒక్కరే అన్నారు. లక్షల కోట్ల రూపాయల డబ్బును ప్రజలకే ఖర్చు పెడుతున్న నాయకుడు మోదీ అన్నారు. మహిళ మేల్కొంటే నరకాసురుడైనా... మహిషాసురుడైనా... ఎవరినైనా వధించేదాకా నిద్రబోదన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మా శక్తి ఏమిటో చూపిస్తామన్నారు. అబ్ కీ బార్... మోదీ సర్కార్ అని నినదించారు.