ధర్మశాల టెస్టులో కుల్దీప్ యాదవ్ విజృంభణ.. కుప్పకూలిన ఇంగ్లండ్
- 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచిన కుల్దీప్
- 100వ టెస్టు ఆడుతున్న అశ్విన్కు 2 వికెట్లు
- భారత స్పిన్నర్ల దెబ్బకి ఇంగ్లండ్ విలవిల
ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన పర్యాటక జట్టును భారత స్పిన్నర్లు దెబ్బ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ (27), బెయిర్ స్టో (29), జో రూట్ (26) పరుగులు చేయగా.. కెప్టెన్ బెన్స్టోక్స్ డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 55 ఓవర్లు ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.