మేడారం మహా జాతర పోస్టర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- మహా జాతర పోస్టర్ ఆవిష్కరణలో మంత్రులు సీతక్క, సురేఖ, పొన్నం, పొంగులేటి
- మేడారం జాతర పనులను పరిశీలించిన కలెక్టర్ త్రిపాఠి
- అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి
మేడారం జాతర పనులు పరిశీలించిన కలెక్టర్
ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి శనివారం మేడారం జాతర పనుల పురోగతిని పరిశీలించారు. హరిత హోటల్, దేవాలయ పరిసరాలు, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఊరట్టం రోడ్డు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక పనులు, అప్పటికప్పుడు చేయాల్సిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తోన్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రతిరోజు పనుల పురోగతిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటున్నట్లు తెలిపారు.