Asaduddin Owaisi: జమిలి ఎన్నికలపై కమిటీకి లేఖ రాసిన అసదుద్దీన్ ఒవైసీ
- జమిలి ఎన్నికల ప్రతిపాదనలను వ్యతిరేకించిన మజ్లిస్
- జమిలి ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి విపత్తు అని పేర్కొన్న అసదుద్దీన్
- కోవింద్ నేతృత్వంలోని కమిటీకి లేఖను పంపించిన అసదుద్దీన్
మజ్లిస్ పార్టీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ జమిలి ఎన్నికలపై వేసిన ఉన్నతస్థాయి కమిటీకి లేఖ రాశారు. జమిలి ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇవి భారత ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విపత్తు కలిగిస్తాయని అసదుద్దీన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
దేశంలో తరచుగా ఎన్నికలను నివారించటం, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని తగ్గించటమే జమిలి ఉద్దేశం. మన దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీకి అసదుద్దీన్ తమ పార్టీ అభిప్రాయాన్ని పంపించారు.
దేశంలో తరచుగా ఎన్నికలను నివారించటం, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయాన్ని తగ్గించటమే జమిలి ఉద్దేశం. మన దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీకి అసదుద్దీన్ తమ పార్టీ అభిప్రాయాన్ని పంపించారు.