అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు సాయం చేయాలని ప్రధాని మోదీని కోరాం: మల్లు భట్టి విక్రమార్క
- ప్రధానితో దాదాపు గంటపాటు సీఎం రేవంత్, మల్లు భట్టి విక్రమార్క సమావేశం
- తెలంగాణ ప్రయోజనాల కోసమే మోదీని కలిశామన్న మల్లు భట్టి
- బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అంశాల ప్రస్తావన
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. విభజన చట్టం ప్రకారం ఓ భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరినట్లు తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరామన్నారు. తెలంగాణకు ఐఐఎం, సైనిక్ స్కూల్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని మల్లు భట్టి అన్నారు. బీఆర్ఎస్ నేతల ఆర్థిక అరాచకం కారణంగా తెలంగాణ అప్పులపాలైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు సాయం చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.