ఆ ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం!: సీఎం రేవంత్ రెడ్డి
- పలువురు మంత్రులకు బంగ్లాల కేటాయింపుపై రేవంత్ స్పందన
- రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో ఉపయోగకరంగా ఉండదన్న సీఎం
- కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం
ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజా భవన్లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా ఉపయోగించుకుంటామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ పద్నాలుగు గంటలకు మించి ఇవ్వలేదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని వెల్లడించారు. రేపు బీఏసీ సమావేశం ఉంటుందని, శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.