ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు ప్రజలు గుర్తుకు వస్తారు: మంత్రి మల్లారెడ్డి
- అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలన్న మల్లారెడ్డి
- రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారన్న మంత్రి
- కాంగ్రెస్, బీజేపీల మాయమాటలు నమ్మవద్దని కోరిన మల్లారెడ్డి
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజలను ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధి పట్టదన్నారు. అందుకే ఆ పార్టీల మాయమాటలు నమ్మవద్దన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే ఘట్కేసర్ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.