Advertisement

భారత్‌లోకి మెర్సిడెస్ కొత్త హైబ్రిడ్ సెడాన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Mercedes launches new hybrid sedan in India price and features details
  • భారత్‌లో 'మెర్సిడెస్-ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్ 4మేటిక్+' సెడాన్ విడుదల
  • దేశంలోనే ఇది తొలి ఎలక్ట్రిఫైడ్ ఏఎమ్‌జీ ఈ-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్
  • పెర్ఫార్మెన్స్, రేసింగ్ ఎడిషన్లలో లభ్యం.. ప్రారంభ ధర రూ. 1.45 కోట్లు
  • పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో 612 హెచ్‌పీ పవర్.. 3.8 సెకన్లలో 100 కి.మీ వేగం
  • రేస్ ట్రాక్ పనితీరుతో పాటు రోజువారీ వినియోగానికి అనువుగా రూపకల్పన
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా, భారత మార్కెట్లో తన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసింది. దేశంలోనే తొలి ఎలక్ట్రిఫైడ్ ఏఎమ్‌జీ ఈ-క్లాస్ సెడాన్ అయిన 'మెర్సిడెస్-ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్ 4మేటిక్+'ను గురువారం లాంచ్ చేసింది. ఏఎమ్‌జీ బ్రాండ్ అందించే అద్భుతమైన పనితీరుతో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ అందించే ఇంధన సామర్థ్యం ఈ కారు సొంతం.

ఈ కొత్త సెడాన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎడిషన్ ధర రూ. 1.45 కోట్లు కాగా, రేసింగ్ ఎడిషన్ ధర రూ. 1.48 కోట్లుగా (రెండు ధరలూ ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను వినియోగదారులకు అందించాలనే తమ వ్యూహంలో భాగంగా ఈ కారును విడుదల చేసినట్లు మెర్సిడెస్-బెంజ్ పేర్కొంది.

ఈ సందర్భంగా మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోశ్‌ అయ్యర్ మాట్లాడుతూ.. "భారత ఆటోమోటివ్ పరిశ్రమలో ఈ-క్లాస్ సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న మోడల్. కొత్త ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్, అద్భుతమైన పనితీరు, రోజువారీ వినియోగానికి అవసరమైన సౌలభ్యం, ఎలక్ట్రిక్ సామర్థ్యం వంటి అంశాలను ఒకేచోట అందిస్తోంది. రేస్ ట్రాక్ మీద అవసరమైన పెర్ఫార్మెన్స్‌ను, రోజువారీ ప్రయాణాలకు కావాల్సిన ప్రాక్టికాలిటీని ఈ సెడాన్ సమన్వయం చేస్తుంది" అని వివరించారు.

ఇంజిన్, పనితీరు వివరాలు
మెర్సిడెస్-ఏఎమ్‌జీ ఈ 53 హైబ్రిడ్‌లో 3.0-లీటర్ ఇన్‌లైన్ సిక్స్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 449 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఏఎమ్‌జీ స్పీడ్‌షిఫ్ట్ టీసీటీ 9జీ ట్రాన్స్‌మిషన్‌లో అనుసంధానించిన 120 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను జతచేశారు. ఈ రెండూ కలిసి ఏకంగా 585 హెచ్‌పీ (రేస్ స్టార్ట్ ఫంక్షన్‌తో 612 హెచ్‌పీ) శక్తిని, 750 Nm టార్క్‌ను విడుదల చేస్తాయి. 

ఈ కారు కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగాన్ని ఎలక్ట్రానిక్‌గా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. అయితే, అదనపు ఏఎమ్‌జీ డ్రైవర్స్ ప్యాకేజీతో ఈ వేగాన్ని 280 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు.
Advertisement
Mercedes Benz India
Mercedes AMG E 53 Hybrid
Luxury Hybrid Sedan India
Mercedes E Class Price
Santosh Iyer
Plug in Hybrid Cars India

More Telugu News