ఈ దేశం మీది... ఈ రాష్ట్రం మీది...: యువతకు కేసీఆర్ పిలుపు
- ప్రజాస్వామ్యంలో ఉండే ఏకైక ఆయుధం ఓటు అన్న కేసీఆర్
- మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును అందరూ గమనించాలని విజ్ఞప్తి
- 2004లో మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాక పదవులు పంచుకున్నారని విమర్శ
- కానీ 14 ఏళ్ల పాటు మనం తెలంగాణ కోసం పోరాడామన్న కేసీఆర్
తెలంగాణ ఇస్తామని నమ్మబలికి 2004లో మనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారని, కానీ వారు మనిషికిన్ని మంత్రి పదవులు పంచుకుని అధికార దాహం తీర్చుకున్నారన్నారు. కానీ తెలంగాణను వదిలి పెట్టారన్నారు. కానీ మనం మాత్రం తెలంగాణను వదల్లేదన్నారు. కొట్టాడుకుంటూ కొట్లాడుకుంటూ పోయాం.. 14 ఏళ్లు గడిచిన తర్వాత తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడే ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ కోసం దిగివచ్చారన్నారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయలేదన్నారు. రాజీనామా చేయమంటే లాగులు తడిశాయన్నారు.
ఉద్యమించి మనం తెలంగాణ సాధించుకు వచ్చామన్నారు.
మూడు గంటల కరెంట్ అనేటోడు ఎప్పుడైనా పొలం దున్నిండా? అని ప్రశ్నించారు. వ్యవసాయం తెలియదన్నారు. హైదరాబాద్లో ఎయిర్ కండీషన్లో ఉంటున్నావని, కానీ నేనేమో రైతునని, తనకు అన్నీ తెలుసునన్నారు. రాహుల్ గాంధీ నాగలి దున్నిండో, వ్యవసాయం చేశాడో తనకు తెలియదన్నారు. ధరణి కారణంగా రైతుబంధు నగదు నేరుగా రైతుల ఖాతాల్లో పడుతోందని, రైతుబీమా కూడా నేరుగా వారికే అందుతోందన్నారు. మరి ధరణిని తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా మాట్లాడితే గడ్డం తీసుకోనంటూ సవాల్ చేస్తున్నాడని, కానీ కావాల్సింది శపథాలు కాదని, పని కావాలన్నారు.