Vijayasai Reddy: పురందేశ్వరి టీడీపీ కోవర్ట్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • ఏపీ బీజేపీలో చాలామంది కోవర్టులు ఉన్నారన్న విజయసాయి 
  • జనసేన ప్రస్తుతం బీజేపీతో ఉందని, భవిష్యత్తులో టీడీపీతో కలుస్తుందని వ్యాఖ్య 
  • అందుకే టీడీపీకి మద్దతు పలికారని చెప్పిన విజయసాయిరెడ్డి
VijayaSaiReddy says Purandeswari is TDP covert

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని తాము టీడీపీ కోవర్టుగానే భావిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏపీ బీజేపీలో చాలామంది టీడీపీ కోవర్టులున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ బంద్‌కు జనసేన మద్దతివ్వడంపై కూడా ఆయన స్పందించారు. జనసేన ప్రస్తుతం బీజేపీతో ఉందని, కానీ భవిష్యత్తులో టీడీపీతో కలుస్తుందనే అభిప్రాయం ఉందని చెప్పారు. అందుకే టీడీపీకి పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News