'డబుల్ ఇస్మార్ట్' కోసం సంజయ్ దత్ పారితోషికం ఎంతంటే ..!
- పూరి దర్శకుడిగా రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్'
- గతంలో హిట్ కొట్టిన 'ఇస్మార్ట్ శంకర్'కి ఇది సీక్వెల్
- విలన్ గా కనిపించనున్న సంజయ్ దత్
- 60 రోజులకు గాను 15 కోట్ల పారితోషికం?
సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేసిన 'ఆది పురుష్' సంగతి అలా ఉంచితే, ఎన్టీఆర్ 'దేవర'లోను ఆయన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే నేరుగా తెలుగు సినిమాలలో విలన్ గా చేయడానికి సంజయ్ దత్ కూడా రంగంలోకి దిగిపోయాడు. 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో ఆయన పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు.
రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. ముంబై నేపథ్యంలో ఈ కథ నడవనుంది. ఈ సినిమా చేయడానికి సంజయ్ దత్ 60 రోజులను కేటాయించారట. ఇందుకుగాను ఆయన 15 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా వదిలిన ఆయన ఫస్టు లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.