Nara Lokesh: రేపటి నుంచి మళ్లీ లోకేశ్ పాదయాత్ర

  • మహానాడు కారణంగా యువగళానికి విరామం
  • ఈ నెల 26 నుంచి 29 వరకు నిలిచిన పాదయాత్ర
  • మే 30న జమ్మలమడుగు క్యాంప్ సైట్ నుంచి యువగళం పునఃప్రారంభం
Lokesh Yuvagalam Padayatra restarts from tomorrow

తెలుగుదేశం పార్టీ మహానాడు కారణంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు నాలుగు రోజుల విరామం లభించడం తెలిసిందే. ఈ నెల 26 నుంచి 29 వరకు పాదయాత్ర నిలిచిపోయింది. చివరగా ఆయన కడప జిల్లా జమ్మలమడుగు నియోజవకర్గంలో పాదయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో, రేపు (మే 30) నారా లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు షెడ్యూల్ విడుదల చేశాయి.

యువగళం వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1423.7 కి.మీ.
111వరోజు పాదయాత్ర వివరాలు (30-5-2023)
జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):
సాయంత్రం
4.00 – జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.20 – పెద్దపసుపుల మోటు వద్ద స్థానికులతో మాటామంతీ.
4.30 – సంజాముల మోటు వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.
5.45 – జమ్మలమడుగు పాతబస్టాండు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.
6.15 – కన్నెలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
8.15 – ధర్మవరం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
9.00 – శేషారెడ్డిపల్లె పాలకోవా సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
9.30 – దేవగుడి సుంకులాంబ దేవాలయం వద్ద విడిది కేంద్రంలో బస.

More Telugu News