Nara Lokesh: లోకేశ్ పాదయాత్రకు బ్రేక్.. కారణమిదే!

  • 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు
  • మహానాడులో పాల్గొనేందుకు వెళ్లనున్న లోకేశ్
  • నాలుగు రోజులపాటు పాదయాత్రకు తాత్కాలిక విరామం
  • ఈనెల 30న జమ్మలమడుగులో యాత్రను పున:ప్రారంభించనున్న లోకేశ్
four days break for nara lokesh yuvagalam padayatra

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రను నాలుగు రోజుల పాటు నిలిపేయనున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరగనుండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో లోకేశ్ యాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈనెల 30న పున:ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు జమ్మలమడుగులో పాదయాత్రను లోకేశ్ ముగించారు. తర్వాత అక్కడి నుంచి కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో అమరావతికి చేరుకోనున్నారు. రేపు అమరావతి నుంచి బయల్దేరి వెళ్లి.. రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు.

ఇక ఈ రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

More Telugu News