కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం: నారా లోకేశ్
- కర్నూలులో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్ర
- జిల్లా కోర్టు భవనం వద్ద లోకేశ్ ను కలిసి సంఘీభావం ప్రకటించిన న్యాయవాదులు
- జగన్ పై విమర్శలు కురిపించిన లోకేశ్
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. తమది జగన్ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ హామీపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.