బ్రిటన్లో తొలి జగన్నాథ ఆలయం... రూ.250 కోట్ల విరాళం ఇచ్చిన ఎన్నారై
- లండన్ శివారులో నిర్మించే ఆలయానికి బిశ్వనాథ్ భూరి విరాళం
- ఆలయ నిర్మాణ పనులకు ఆహ్వానించిన క్రమంలో ప్రకటన
- పదిహేను ఎకరాల్లో... 2024 నాటికి ఆలయం పూర్తి
ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానికులు శ్రీ జగన్నాథ సొసైటీ యూకేగా ఏర్పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇటీవల అక్షయ తృతీయ రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిశ్వనాథ్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతను భారీ విరాళం ప్రకటించారు.
2024 నాటికి ఈ ఆలయం పూర్తవుతుంది. ఈ జగన్నాథ దేవాలయాన్ని లండన్ శివారులో పదిహేను ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోకల్ కౌన్సిల్ లో దేవాలయానికి సంబంధించిన ప్రీప్లానింగ్ అప్లికేషన్ ను సమర్పించారు.