Sri Lakshmi: జగన్ అక్రమాస్తుల కేసు.. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్

  • ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగించిన తెలంగాణ హైకోర్టు
  • ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందంటూ సుప్రీంలో సీబీఐ పిటిషన్
  • ఆమెను వదలకూడదని పిటిషన్ లో కోరిన సీబీఐ
CBI files petition on Sri Lakshmi IAS in Supreme Court in Jagans dispropotionage assets case

జగన్ అక్రమాస్తుల కేసు సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని వెంటాడుతూనే ఉంది. ఈ కేసు నుంచి ఆమెను వదిలిపెట్టకూడదని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం ఐరన్ ఓర్ కంపెనీకి సంబంధించి గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను విచారించాల్సిందేనని తెలిపింది. మరోవైపు ఈ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేసు నుంచి ఆమె పేరును తొలగించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

More Telugu News