Suresh Daggubati: దగ్గుబాటి సురేశ్ బాబు, రానాలపై క్రిమినల్ కేసు నమోదు

  • ఓ భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ బాబు, రానా
  • తండ్రీకొడుకులపై నాంపల్లి కోర్టును ఆశ్రయించిన వ్యాపారవేత్త
  • స్థలం విషయంలో బెదిరిస్తున్నారని ఆరోపణ
  • సురేశ్ బాబు, రానాలకు కోర్టు సమన్లు
Criminal case files against Daggubati Suresh Babu and Rana

టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, ఆయన తనయుడు, ప్రముఖ నటుడు రానాలపై ఓ భూ వివాదంలో కేసు నమోదైంది. కొంతకాలంగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారవేత్తకు... సురేశ్ బాబుకు మధ్య వివాదం నడుస్తోంది. స్థలం ఖాళీ చేయాలంటూ సురేశ్ బాబు, రానా దౌర్జన్యానికి పాల్పడ్డారని, సురేశ్ బాబు తనను చంపేస్తానని కూడా బెదిరించారని ప్రమోద్ కుమార్ చెబుతున్నారు. 

ఈ విషయంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు స్పందించడంలేదంటూ, ప్రమోద్ కుమార్ నేరుగా నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ప్రమోద్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదు కాగా... విచారణకు రావాలంటూ కోర్టు సురేశ్ బాబు, రానాలకు సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News