ఎస్బీఐలో భారీ రిక్రూట్మెంట్.. 9 వేలకు పైగా పోస్టులు
- 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రకటన
- ఆగస్టు 11 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- హైదరాబాద్ సర్కిల్లో 260 ఉద్యోగాల కేటాయింపు
- ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక
- డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
ప్రభుత్వ రంగ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 9,124 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి మంగళవారం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 11న ప్రారంభం కాగా, అభ్యర్థులు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా 2026 డిసెంబర్ 31 నాటికి ఉత్తీర్ణత పత్రం సమర్పించే షరతుతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ నోటిఫికేషన్లో భాగంగా హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) పరిధిలో 260 పోస్టులను కేటాయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. తొలుత ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష (సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 3 తేదీల్లో), అనంతరం మెయిన్స్ పరీక్ష (నవంబర్లో) నిర్వహిస్తారు. తుది దశలో స్థానిక భాషా ప్రావీణ్యతను పరీక్షిస్తారు. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఆ రాష్ట్ర స్థానిక భాషలో నైపుణ్యం కలిగి ఉండటం తప్పనిసరి అని ఎస్బీఐ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా సూచించింది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా 2026 డిసెంబర్ 31 నాటికి ఉత్తీర్ణత పత్రం సమర్పించే షరతుతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ నోటిఫికేషన్లో భాగంగా హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) పరిధిలో 260 పోస్టులను కేటాయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. తొలుత ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష (సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 3 తేదీల్లో), అనంతరం మెయిన్స్ పరీక్ష (నవంబర్లో) నిర్వహిస్తారు. తుది దశలో స్థానిక భాషా ప్రావీణ్యతను పరీక్షిస్తారు. అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఆ రాష్ట్ర స్థానిక భాషలో నైపుణ్యం కలిగి ఉండటం తప్పనిసరి అని ఎస్బీఐ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా సూచించింది.