Pavan Kalyan: ఈ స్థాయిలో పవన్ ఫైట్స్ చేయడం ఇంతకుముందు చూసుండరు: నిర్మాత ఎ.ఎమ్.రత్నం

  • 'హరిహర వీరమల్లు'గా పవన్ కల్యాణ్ 
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎ.ఎమ్. రత్నం 
  • ఇది పాన్ ఇండియా రేంజ్ సినిమా అని వ్యాఖ్య 
  • సంచలనం సృష్టించడం ఖాయమని వెల్లడి  
A M  Rathnam Interview

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారు. ఆ సెట్స్ లోనే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో అందాల సందడి చేయనుంది. 

తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి ఎ.ఎమ్. రత్నం మాట్లాడుతూ .. " కొన్ని కథలు పాన్ ఇండియా లక్షణాలను కలిగి ఉంటాయి .. అలాంటి కథనే ఇది. సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్లనే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాము. సౌత్ లో కంటే నార్త్ లోనే ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందనే నమ్మకం బలంగా ఉంది" అన్నారు. 

"పవన్ కల్యాణ్ గారిపై రీసెంట్ గా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాము .. అది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా హైలైట్స్ లో అది ఒకటిగా నిలుస్తుంది. పవన్ కల్యాణ్ గారు ఈ స్థాయిలో ఫైట్స్ చేయడం ఇంతకుముందు చూసుండరు. సినిమా చూసిన తరువాత పవన్ ఫ్యాన్స్ కూడా ఇదే మాట అంటారు. ఈ సినిమా మరో సంచలనాన్ని సృష్టించడం ఖాయం" అంటూ చెప్పుకొచ్చారు..

More Telugu News