జీనోమ్ వ్యాలీలో ఒకే రోజు 5 కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్
- లైఫ్ సైన్సెస్ హబ్ గా జీనోమ్ వ్యాలీ
- 5 కొత్త కంపెనీలను ప్రారంభించిన కేటీఆర్
- రూ.11 వేల కోట్ల పెట్టుబడితో యూనిట్ల ఏర్పాటు
- కొత్తగా 3 వేల మందికి ఉపాధి లభించనుందన్న మంత్రి
జీనోమ్ వ్యాలీలో మంగళవారం పిరమల్ ఫార్మా, ప్రొపెల్లాంట్, బ్రిటన్ కు చెందిన ఆక్టిస్ ఎల్ఎల్ పీ, జీవీ రీసెర్చీ ప్లాట్ ఫామ్, అమెరికాకు చెందిన ఎన్విగో సంస్థలు తమ నూతన యూనిట్లను ప్రారంభించాయి. ఈ కంపెనీలు మొత్తంగా రూ.11 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాయని కేటీఆర్ తెలిపారు. ఈ కొత్త యూనిట్ల ద్వారా తెలంగాణలో మరో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు.